Thursday, March 31, 2016

రన్

రన్-- చతికిలపడ్డాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
బాగోలేదు రన్
తారాగణం:
సందీప్‌కిషన్, అనీషా అంబ్రోస్, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్, రాంప్రసాద్, బాబి సింహ , కాశీ విశ్వనాథ్, బంటి సతీష్ తదితరులు
సినిమాటోగ్రఫీ:
రాజశేఖర్
సంగీతం: సాయకార్తీక్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి, కిషోర్, అజయ్ సుంకర,
దర్శకత్వం: అని కనె్నగంటి
తమిళంలో సూపర్ హిట్ అయిన నేరం చిత్రానికి రీమేక్- రన్. అని కనె్నగంటి దర్శకత్వం, అనీష అంబ్రోస్ అందం, అనిల్ సుంకర సమర్పణ ఎవరినెలా ఆకట్టుకుందో చూద్దాం.
ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని కొత్త జాబ్‌ను వెతికే ప్రయత్నంలో ఉన్న కుర్రాడే సంజు (సందీప్ కిషన్). చిన్ననాటి స్నేహితురాలైన అమూల్య (అనీష అంబ్రోస్)తో ప్రేమలో ఉంటాడు. జాబ్ లేదనే కారణంగా అమూల్య ఫాదర్ శ్రీనివాసులు (కాశీ విశ్వనాథ్) వీరి పెళ్ళికి ఒప్పుకోడు. డబ్బు వడ్డీకి తీసుకుని, చెప్పిన టైంకి ఇవ్వకపోతే ప్రాణంతీసి బాడీ పార్ట్స్ అమ్ముకునైనా అప్పు వసూలు చేసుకునే కిరాతకుడు వడ్డీ రాజు (బాబీసింహా). సంజు తన చెల్లి పెళ్ళికోసం వడ్డీ రాజు దగ్గర అప్పుతీసుకుంటాడు. కట్ చేస్తే డబ్బు తిరిగి ఇవ్వాల్సిన టైం వస్తుంది. సంజు డబ్బుతో బయలుదేరుతాడు. అదే టైంలో రెండు ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవే అమూల్య సంజుకోసం ఇంటినుంచి వచ్చేయడం, సంజుదగ్గర ఉన్న డబ్బుని దొంగల బాచ్ కొట్టేయడం. ఇక అక్కడినుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది...? సంజు ఒకే టైంలో దొంగలు కొట్టేసిన డబ్బుని దక్కించుకోవడానికి ఏంచేసాడు? అమూల్యని ఎలా దక్కించుకున్నాడు? వడ్డీరాజు డబ్బుకోసం సంజుని ఎలా ఇబ్బందుల్లో తోసాడు? అన్నదే అసలు కథ.
సైలెంట్‌గా కనిపిస్తూ, చేసేవన్నీ చేసేసే టైపు పాత్రలో సందీప్ కిషన్ కనిపించాడు. కాస్త అండర్‌ప్లే చేసే ఈ పాత్రని అసలు చేయలేకపోయాడు. కొన్నిచోట్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే, కొన్నిచోట్ల అవసరమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేకపోయాడు. అనీషా అంబ్రోస్ మాత్రం క్యూట్ లుక్స్‌లో కనిపించింది. ప్రేమ సన్నివేశాల్లో హావభావాలు బాగా పలికించింది. సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత మాత్రం లేదు. ఇక సినిమాకి కీలకమైన పాత్ర చేసింది బాబీ సింహా.. తమిళ వెర్షన్‌లో చేసిన పాత్రని మళ్ళీ చేయడంలో చాలావరకూ సక్సెస్ అయ్యాడు. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నా కుదరలేదు. అమ్మాయిని బుట్టలో వేసుకునే పాత్రలో మహాత్ రాఘవేంద్ర ఓకే అనిపించాడు. ఇక ఎస్‌ఐ పద్మావతిగా బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళిలు అక్కడక్కడా నవ్వించారు.
ఇక స్క్రీన్‌ప్లే తమిళ వెర్షన్‌లో ఎలా ఉందో యాజిటీజ్‌గా అలానే ఉంది. సినిమా ప్రారంభం టైం అనే కానె్సప్ట్ గురించి చెబుతూ ఆసక్తికరంగా స్టార్ట్‌చేసి, అంతే ఆసక్తికరంగా సినిమాని నడిపించాడు. మొదటి అర్ధ్భాగంలో కొన్నికొన్ని స్లోసీన్స్ ఉన్నా ఫ్లోలో పరవాలేదనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బాంగ్‌కి ఇక టార్గెట్ ఏంమిటో తెలిసిపోవడం, కొత్తగా జత చేసిన సీన్స్ బోర్‌కొట్టడంతో సెకండాఫ్ స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తుంది. సూపర్ హిట్ కానె్సప్ట్‌ని డైరెక్టర్ అనిల్ కనె్నగంటి మిస్‌యూస్ చేశాడనిపిస్తుంది. మిగతా టెక్నికల్ టీంలో రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. హైదరాబాద్‌లోని లొకేషన్స్‌ని, గల్లీలని ఎఫెక్టివ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించి విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు. మ్యూజికల్ డైరెక్టర్ సాయికార్తీక్ అందించిన పాటలు బాగున్నా సినిమాలో లెంగ్త్ పెంచేసి బోర్‌కొట్టించాయి. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్ ఎం.ఆర్.వర్మ ఫస్ట్‌హాఫ్‌ని మేనేజ్ చేసినా సెకండాఫ్‌ని మేనేజ్ చేయలేక సాగదీసేసి ఆడియన్స్ బోర్ కొట్టించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఒరిజినల్ వెర్షన్‌లోని ఫీల్‌ని మిస్‌చేసి చేసిన సినిమా ఇది. కంటెంట్‌ని వదిలేసి కమర్షియాలిటీకి ప్రాధాన్యతనిచ్చి చేసే రీమేక్ సినిమా ప్రేక్షకులను మెప్పించినట్లు, హిట్ అయినట్టు దాఖలాలు లేవు. రీమేక్ అనగానే తెలుగులో చేసే మొదటి తప్పు, ఒరిజినల్ ఫీల్‌ని వదిలేసి ఇక్కడి ఆడియన్స్‌కోసం నానా హంగామా దట్టించడం, పంచ్‌ల కామెడీ కోసం ఒరిజినాలిటీని చంపేయడం. అదే తప్పు ఈ సినిమాలోనూ జరిగింది. అందుకే పరిగెత్తాల్సిన సినిమా కాస్తా పాకినట్టు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కమర్షియల్ అంశాలను అందించాలని పాటలను, కామెడీని బలవంతంగా జొప్పించారు. సినిమాలో డైరెక్టర్ తెగ కామెడీ ఉందని ఫీల్ అయినా ఆడియన్స్ మాత్రం నవ్వలేకపోయారు. పైగా సినిమాకి కీలకం అయిన వడ్డీ రాజు పాత్రని సీరియస్‌గా కాకుండా కామెడీగా మార్చడం కంటెంట్‌ని తప్పుదోవ పట్టించింది. అలాగే దొంగల ముఠా బాచ్‌కోసం కమెడియన్స్‌ని నటీనటులుగా ఎంచుకోవడం అస్సలు సెట్‌కాని విషయం.

దృశ్యకావ్యం


ఓ దెయ్యం కథకి ‘దృశ్యకావ్యం’ అన్న భావుకత్వపు టైటిల్ పెట్టడం వరకూ.. కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. ఐతే -ఆ దెయ్యం చేష్ఠల్లో మాత్రం వెరైటీ ప్రోగ్రామింగ్‌లేవీ లేవు. పాత దెయ్యం కథలన్నీ... నేలమాళిగలోనో సమాధిలోనో పెట్టి.. ఇనే్నళ్లకో ఇన్నాళ్లకో తీసి తెర కెక్కిస్తే.. ఆ హారరే వేరనుకోటానికీ లేదు. కానీ- కాస్త శృతిమించి ‘పార్ట్-2’ అంటూ జనం చెవుల్లో సరికొత్త పూలు పెట్టడం చూస్తే.. ఆహా నిజంగానే ‘ఇదో దృశ్య కారం’ అనిపించక మానదు. నిజానికి ఈ కథలో కొత్తదనం లేకపోలేదు. అదేంటో చూద్దాం.
కథ: -అఖిల్ (రామ్ కార్తీక్), అభినయ (కశ్మీరా కులకర్ణి) -ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. ఒకానొక రోజు అభినయ కుటుంబం మొత్తం ప్రమాదవశాత్తు మరణించటంతో ఆమెపట్ల మరింత ప్రేమని కనబరుస్తాడు అఖిల్. ఆ ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. వారి ప్రేమకి ప్రతిరూపం అనన్య. జీవితం ఇలా సాఫీగా నడిచిపోతూంటుంది. ఇంతలో -ఆఫీస్ పని మీద అఖిల్ యూరప్ వెళ్లాల్సి వస్తుంది. ట్రిప్ కోసం బయల్దేరుతుండగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే దారిలోనే యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. ఐతే - అఖిల్ ఎప్పటిలానే ఫ్యామిలీకి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూంటాడు. మరోవైపు అఖిల్ ఇంట్లో ఏవో శక్తులు తిరుగుతూంటాయి? ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
మరణించిన అఖిల్ ఫోన్ ఎలా చేశాడు? ఆ ఇంట్లో తిరుగాడే అదృశ్య శక్తులు ఏమిటి? ‘నో ఎండ్ ఫర్ ఫీలింగ్స్’ అంటూ ముగించిన ఈ కథలో కొన్ని ప్లస్ పాయింట్లు.. బోలెడన్ని మైనస్ పాయింట్లు దొర్లాయి.
సినిమా అంతా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో.. ఓ నాలుగైదు పాత్రల మధ్య నడుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని లవ్‌ట్రాక్‌తో నడిపించి.. హారర్ ఏ మాత్రం టచ్ చేయకపోవటంతో.. ప్రేక్షకుడు కొద్దిగా సందిగ్ధంలో పడతాడు, అసలు దర్శకుడు ఏం చెబుతాడా? అని. ఇప్పటికే ఒక ‘కట్టప్ప’తోనే జనం ఛస్తూంటే.. ‘దృశ్య కావ్యం-2’లో అసలు హారర్ ఉంటుందనటం అతిశయోక్తి కాక మరేమిటి? ఇన్ని రీళ్లలోనూ ఏం చెప్పారన్నదే ప్రధాన ప్రశ్న. ఇక - చెప్పటానికి ఏం మిగిలిందని ఈ మంత్రం వేశారో అర్థం కాలేదు.
హారర్ కథల రోజులివని.. తెగ ముచ్చటపడి మరీ కథని రాసుకొనేప్పుడు.. లాజిక్ మిస్సవటం సహజం. ఐతే -ఆ లాజిక్‌కి దొరక్కుండా కూడా కథని రాయ్యొచ్చు. ఇక్కడ -ఒక్కటే లోపం. తమ కథని తామే అత్యద్భుతంగా ఊహించుకోవటం. పేజీలపై ‘దృశ్య కావ్యం’గా భావించిన కథ స్క్రీన్‌పైకి వచ్చేప్పటికి.. అటు భావయుక్తంగా కాకండా.. భయపెట్టేదిగానూ లేకపోవటంతో ‘కావ్యం’ కారం నసాళానికి అంటింది. కథకుడిగానే అర్థం కానప్పుడు.. దర్శకుడిగా ఏమర్థమవుతాడు. అదీగాక - ఈ చిత్రానికి సృజనకు పదును పెట్టాల్సిన పనిలేదు. సన్నివేశాలన్నింటినీ ఏ రీతిన తీయాలో... మునుపటి ‘దెయ్యం’ కథలే చెప్పాయి. కాబట్టి కొత్తగా ఆవిష్కరించాల్సిందేమీ లేదు. దర్శకుడి ఊహ ప్రకారం ఆ ఒక్క ‘సస్పెన్స్’ కథని నడిపిస్తుందనుకున్నాడు. కానీ- ఆ ఫీల్‌ని ప్రేక్షకుల్లో కలిగించలేక పోయాడు.
‘ప్రాణం’ కమలాకర్ సంగీతం బాగుంది. పాటల్లో మెలోడీ తొణికిసలాడింది. ఐతే -అవేవీ శ్రోతల్ని చేరతాయా? లేదా? అన్నది సందేహమే. సంతోష్ షనమోని ఫొటోగ్రాఫర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
నటనాపరంగా - మధునందన్ మెప్పించాడు. రామ్‌కార్తీక్ హావభావాలు సోసో. కశ్మీరా చూట్టానికి బాగుంది కానీ.. మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ తెప్పించటానికి చాలా కృషి చేసినట్టుంది. తెర మీదికి ఫైనల్ వచ్చినవి చూస్తే- ‘కృషి’ కనిపిస్తోంది. పాప కేరెక్టర్ ఈ సినిమాకి ప్రాణం. మిగతా పాత్రధారులంతా నవ్వించటానికో.. ఏడిపించటానికో.. భయపెట్టడానికో కష్టపడ్డారు. కానీ అంత ‘దృశ్యం’ లేదు.

ఊపిరి

ఊపిరి -వేసవిలో చల్లని దొరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
బాగుంది ఊపిరి
తారాగణం:
నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్‌రాజ్, జయసుధ, తనికెళ్ల భరణి, అలీ, గాబ్రియాలా, అనుష్క, శ్రీయ తదితరులు
నిర్మాతలు:
ప్రసాద్ వి.పొట్లూరి, కవిన్ అనే్న
సంగీతం:
గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ:
పిఎస్ వినోద్
దర్శకత్వం:
వంశీ పైడిపల్లి
--
వీల్‌ఛెయిర్‌లో నాగార్జున. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ తర్వాత.. ఎవరైనా ‘మన్మథుడి’ రొమాన్స్ తాలూకు అనుభూతిని పొందాలనుకుంటారు తప్ప -వీల్‌ఛెయిర్‌కే పరిమితమైతే ప్రేక్షకుడి ‘ఊపిరి’ ఒక్కసారిగా ఆగిపోతుంది. అందులోనూ ‘ది ఇన్‌టచబుల్స్’ ఫ్రెంచి మూవీకి రీమేక్ ఇది. మనోళ్లు స్ట్రెయిట్ పిక్చర్స్‌తోనే తర్జనభర్జనలుపడి తల్లకిందులవుతూంటే.. ‘హార్ట్ టచ్‌బుల్స్’కి ఏమేరకు న్యాయం చేకూర్చగలరు? అన్న మీమాంస వేధిస్తుంది. మరోవైపు ‘బృందావనం’ ‘ఎవడు’ కమర్షియల్ చిత్రాల ధోరణి ఇంకా వీడక ముందే.. క్లాసిక్‌ని ‘టచ్’ చేయటంలో వంశీ ‘వశీకరణ’ మంత్రం ఏదైనా వేయగలడా? బోలెడన్ని సందేహాలు. ‘వంశీ’ ఇన్‌టచబుల్స్ కథకి రీమేక్ అన్నప్పుడు.. ఎవరికైనా కలిగిన మొదటి సందేహం ఇదే. ఆ ‘్ఫల్’ని చెడగొట్టడానికి కాకపోతే ఏంటి? అని. రీమేక్ అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. ఏమాత్రం అటు ఇటు అయినా.. కథ అడ్డం తిరుగుతుంది. అసలు తెలుగులో ‘హీరో-వీల్‌ఛెయిర్’ అంటే బుద్ధి ఉన్న ప్రేక్షకుడు ససేమిరా అంటాడు. కమర్షియల్ ‘వీల్’కీ, ఇమేజ్ చట్రాలకూ అలవాటు పడింత్తర్వాత -కొత్తదనం కోసం చేసే ఏ ప్రయోగమైనా.. ఇండస్ట్రీలో దెబ్బ కొట్టేస్తుంది. మరి వంశీ ఏంచేస్తాడా? అని ‘ఊపిరి’ బిగపట్టుక్కూర్చున్న ప్రేక్షకుల మదిలో ‘ఊపిరు’ లూదాడా? లేదా? అన్నది చూద్దాం.
-విక్రమాదిత్య (నాగార్జున) వేల కోట్లకు అధిపతి. ఒకానొక పరిస్థితిలో రెండు కాళ్లూ చచ్చుబడి ‘వీల్ ఛెయిర్’కి అతుక్కుపోతాడు. అతడి విశాల ప్రపంచం ఒక్కసారిగా కుంచించుకు పోతుంది. అడుగుతీసి అడుగు వేయలేని స్థితి. విక్రమాదిత్యకి అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి ప్రసాద్ (ప్రకాష్‌రాజ్). అసిస్టెంట్ కీర్తి తనని అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నప్పటికీ ఏదో కోల్పోయానన్న బాధ విక్రమ్‌ని వేధిస్తూంటుంది.
శీను (కార్తీ)కి డబ్బుంటే చాలు. అదే జీవితం. చిన్నచిన్న దొంగతనాలు చేయటం జైల్లో కూర్చోవటం అతని వృత్తి. ఒక దొంగతనం కేసులో జైలుకెళ్లిన శీను పెరోల్‌పై ఇంటికొస్తే... అతని తల్లి (జయసుధ) అసహ్యించుకొంటుంది. ఇంట్లోంచి వెళ్లగొడుతుంది. తాను మారానని పోలీసులను నమ్మిస్తే తప్ప.. కేసుల్లోంచి బయటపడే ఛాన్స్ లేదు కార్తీకి. దొంగ అని తెలిసింత్తర్వాత ఉద్యోగం ఎవరిస్తారు? ఆ పరిస్థితుల్లో మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తాడు. అదీగాక ‘కీర్తి’ అంటే మనసు పారేసుకోవటంవల్ల ఆ ఉద్యోగానికి ఫిక్స్ అయిపోతాడు.
కీర్తిపై ఇష్టంతోనూ.. ఉద్యోగంపట్ల అయిష్టతతోనూ విక్రమ్ ఇంట్లో చేరిన కార్తీ.. రాన్రాను అతడికి దగ్గరవుతాడు. వారిద్దరి ‘జర్నీ’ వీల్‌ఛెయిర్‌తో మొదలై... దేశ దేశాల్నీ.. ప్రేక్షకుల మనసుల్ని చుట్టి వస్తుంది. క్లైమాక్స్‌లో ఏం జరిగిందన్నది చూడాల్సిందే.
ఏ కథలోనైనా.. రచయిత ఉద్దేశం నెరవేరిందా? లేదా? అన్నది తెలియాలంటే.. ప్రేక్షకుల్ని కూడా ఆయా పాత్రలు ‘టచ్’ చేయాలి. థియేటర్‌లోంచో.. పేజీల్లోంచో బయటికి వచ్చినప్పుడు వెంటాడాలి. వారితో చేసిన ‘ప్రయాణం’ మరికాసేపు ఉంటే బావుణ్ణు అనిపించాలి. ఎమోషన్‌కి మించిన ‘వశీకరణ మంత్రం’ మరొకటి లేదు. మానవుడు ఎంతగా ఆధునికత వైపు పయనించినప్పటికీ.. హార్ట్ టచ్ తాలూకు అనుభూతులు ఇంకా మనసు పొరల్లో ఉన్నాయి. కానీ- వాటిని వెలికితీసే ప్రయత్నమే ఎవరూ చేయటంలేదు. అలాంటి యాంత్రికతలోంచి సగటు ప్రేక్షకుణ్ణి ‘ఊపిరి’ పీల్చుకొనేట్టు చేసిందీ కథ.
ఓ పదిమంది అమ్మాయిల్తో సయ్యాట లాడుతూ.. రొమాంటిక్ చూపుల్తో.. రొమాంటిక్ మాటల్తో.. స్టెప్పులేసే నాగార్జునని ‘వీల్‌ఛెయిర్’కి పరిమితం చేస్తే... పరిస్థితి ఏమిటన్నది ఈ సినిమాలో విభిన్నంగా కనిపిస్తుంది. స్టెప్పులేసేవాడే హీరో కాదు. వీల్‌ఛెయిర్‌లో ఉన్నప్పుడూ హీరోనే. ఇక్కడ కొద్దిగా మనసు గురించి మాట్లాడుకోవాలి. ‘వీల్‌ఛెయిర్’ని పక్కనపెట్టి.. నాగార్జున పలికించిన హావభావాలు కానీ.. కంట తడి పెట్టించే సన్నివేశాలు కానీ.. ‘ఊపిరి’ ఆడటంలేదు.. నన్ను కాస్త బయటికి తీసుకెళ్తావా?’ అంటూ అడిగిన తీరుగానీ.. చూస్తే- ప్రేక్షకుడు కూడా తలాడిస్తాడు. ఆ వీల్‌ఛెయిర్‌ని తోసుకుంటూ ప్రేక్షకుడూ వెళ్లిపోతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే- ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ మల్టీ మిలియనీర్‌కీ.. డబ్బుకోసం ఏదైనా చేసే చిల్లరిగాడికీ.. పొంతన కుదురుతుందా? అనిపిస్తుంది. ఈ రెండు పాత్రలూ థియేటర్‌లోంచి.. స్క్రీన్ పైకి తీసుకెళ్లిపోతాయి. ఆ సీన్‌లో అటో ఇటో మనమూ ఉండాలనిపిస్తుంది. ఉంటాం కూడా. అంతగా ప్రభావితం చేస్తాయి. మనసు పొరల్లోని ఆత్మీయతనీ అనుబంధాల్నీ తీయటి అనుభూతుల డోలికల్లో ఊగిసలాడేట్టు చేస్తాయి. మనం మర్చిపోయిన బంధాల్నీ తట్టి లేపుతాయి. జీవితంలో ఇలాంటి వ్యక్తులు తారసపడితే బావుణ్ణనిపిస్తుంది. ఇలా ఒక్కటికాదు.. ఎనె్నన్నో అనుభూతుల మాలికల్తో మనల్ని ముంచెత్తి గాఢంగా ‘ఊపిరి’ పీల్చుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ‘ది ఇన్‌టచబుల్స్’ ఫీల్‌ని -కాళిదాసు కవిత్వం కొంత... నా పైత్యం కొంత అన్నట్టుకాకండా.. ఎలాగూ ‘రీమేక్’ అని జబర్దస్త్‌గా చెప్పేశాం కాబట్టి.. ఉన్నది ఉన్నట్టుగా తీయటంలో తప్పేం లేదని ఫిక్స్ అయిపోయిన వంశీ.. తెలుగు నేటివిటీ కోసం ఏమాత్రం తాపత్రయ పడలేదు. రీళ్లు పెంచాలన్న ఉద్దేశంతో స్క్రీన్‌ప్లే రాసుకోలేదు. అనవసర సన్నివేశాల్ని జొప్పించలేదు.
ఇక నటనాపరంగా -పోటీ పడి జీవించారిద్దరూ. కార్తీకి ఇది తెలుగు స్ట్రెయిట్ పిక్చర్. కానీ ఏమాత్రం భేషజాల్లేకుండా శీను పాత్రలో వొదిగిపోయాడు. నాగార్జున చేసింది కూడా ఓవిధంగా ఛాలెంజింగ్ పాత్ర. ‘సోగ్గాడి’కి అస్సలు నప్పని కేరెక్టర్. కానీ.. ఏదో మత్తు జల్లాడు. ఒక్కో సందర్భంలో ‘నాగ్’కి సహాయకుడిగా మనం ఉంటే బావుణ్ణననిపిస్తుంది -అతడి మాటల తీరు చూస్తే. ఒంటరితనంతో.. అవిటితనంతో.. చాతకాని పరిస్థితిని బయటికి చెప్పుకోలేక.. జీవితాంతం ఒక్కరిపై ఆధారపడటం చూస్తే ఆ కేరెక్టర్ పట్ల జాలి కలుగుతుంది. అదే స్థాయిలో ‘్ఛలెంజింగ్’గానూ అనిపిస్తుంది. ఇలా విశే్లషించుకొంటూ పోతే ‘్ఫల్’ చెడుతుంది. కనుక -‘్ఫల్ గుడ్’ అనేద్దాం. ఏ శాఖ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వారివారి పరిధిలో ఆయా పాత్రలు తమకు నచ్చినట్టు, మనల్ని మెప్పించేట్టు ‘వీల్‌ఛైర్’ని తోసుకుంటూ వెళ్లిపోయాయి.

**కథకళి

పక్కా.. స్క్రీన్‌ప్లే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
**కథకళి
తారాగణం:
విశాల్, కేథరిన్ ట్రెస్సా, మైమ్ గోపి, మధుసూదన, కరుణాస్ తదితరులు
సంగీతం:
హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ:
బాలసుబ్రహ్మణ్యం
నిర్మాత:
విశాల్
దర్శకత్వం:
పాండీరాజ్
--
ఫర్వాలేదు
--
ప్రేక్షకుణ్ణి రెండు గంటలపాటు థియేటర్‌లో కూర్చోపెట్టాలంటే మంచి కథే అవసరం లేదు. సరైన స్క్రీన్‌ప్లే ఉన్నా సాధ్యమేనని కథకళి చెబుతుంది. ఓ చిన్న పాయింట్‌తో కథ తీసుకుని దానికి ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే రాసుకుని, సన్నివేశాలను తెరపై కథాకళి చేయిస్తే ప్రేక్షకుడు సీట్లోనుంచి లేవడు అనడానికి ఈ చిత్రం ఓ ఉదాహరణ. కథలనేవి కొన్నిరకాలే. స్క్రీన్‌ప్లే మాత్రం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అలాంటిదానికి ఉదాహరణే కథకళి.
కథేంటి?
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కమల్ (విశాల్) తన ప్రేయసి మల్లీశ్వరి (కేథరీన్ ట్రెస్సా)ని పెళ్లిచేసుకోవడానికి స్వంత ఊరైన కాకినాడ వస్తాడు. అతని కుటుంబానికి ఊర్లో వుండే జాలర్ల సంఘం అధ్యక్షుడు సాంబకు మొదటినుండీ చిన్న చిన్న గొడవలు వుంటాయి. ఈ నేపథ్యంలో సాంబ హత్యకు గురవుతాడు. నేరం ఎవరు చేశారో తెలియదు. కానీ మొదటినుండీ ఉన్న గొడవలవల్ల కమల్ నేతృత్వంలో ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులతోపాటుగా ఊరి ప్రజలు అనుమానిస్తారు. ఆ అనుమానం నిజమా? కాదా? అనేదే మిగతాసినిమా. హత్యనుండి ప్రారంభమైన కథనం ఎత్తుపల్లాలు దాటుకుంటూ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుణ్ణి గుక్క తిప్పుకోకుండా చేస్తుంది. అసలు కమల్ కుటుంబానికీ సాంబకు వున్న గొడవేంటి? పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో వచ్చిన ఈ అవాంతరాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరమైన కథనం.
ఎలా వుంది?
మొదటినుండీ సినిమా స్క్రీన్‌ప్లే హైలెట్స్‌తో సాగడంతో ఎక్కడా బోర్ కొట్టదు. కాకపోతే, కథ చిన్నది కనుక ఆ లోపాన్ని కనపడకుండా స్క్రీన్‌ప్లేను ఎమోషన్స్‌తో మేళవించి రాసుకోవడం ప్లస్‌పాయింట్ అయింది. అయతే, ఏమోషనల్ సన్నివేశాల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగా కుదరకపోవడంతో సన్నివేశాలు సోసోగా సాగాయి. ఒక్కొక్కసారి మరీ ఓవర్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది. దానికితోడు సందర్భం లేకుండా వచ్చిపడే పాటలు ప్రేక్షకుడిని పక్కదారి పట్టిస్తాయి. అయినాకానీ స్క్రీన్‌ప్లే బలంతో లోటు కనపడదు.
సినిమాకు మొదటినుండీ సస్పెనే్స హైలెట్ కనుక దర్శకుడు ఎక్కడా అది రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నడిపాడు. అన్ని సంఘటనలకు సరైన కారణాలను చూపుతూ అన్ని కోణాల్లో అల్లుకున్న స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశం. సినిమాలో పగ, ప్రతీకారాలు అనే అంశాన్ని కథానాయకుడు వైపున, విలన్ వైపున రెండు కోణాల్లో చెప్పినా, అసలు విషయాన్ని చెప్పకుండా సెకండాఫ్‌లో సినిమాను వేగంగా నడిపించడంలోనే దర్శకుడి పనితనం కనిపిస్తుంది. విశాల్ సినిమా అంటేనే యాక్షన్ నేపథ్యంలోవున్న ఫ్యామిలీ డ్రామా. ఈ కథ అందుకు మినహాయింపు కాదు. కుటుంబ కథకే హత్యానేపథ్యం జోడించడంతో ఓ సరికొత్త ఫ్లేవర్‌ను ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. పూర్తి స్థాయి మర్డర్ మిస్టరీకి సరిపడే కథనం కాకపోయినా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుణ్ణి మాయచేశారు. అక్కడక్కడా అవసరం లేని సన్నివేశాలు వచ్చినా అవి పక్కకు తొలగిపోతాయి. కథకళి అన్న పేరే ఈ చిత్రానికి సరైనది అన్నట్టే చేశారు. థ్రిల్లర్ అంశానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి క్లైమాక్స్ కథనాన్ని తగ్గించారు. వైజాగ్ నుంచి కాకినాడ బయలుదేరిన హీరో ప్రయాణంలోనే కథనాన్ని పరిగెత్తించారు. స్క్రీన్‌ప్లే ఎలా సాగిందో అదేవిధంగా క్లైమాక్స్‌లో కూడా సాగినట్టయితే సినిమాకు మరింత బలం చేకూరేది. సినిమా కథనంలో రకరకాల మలుపులు కనపడడంలో అక్కడక్కడా అనుమానాలు ప్రేక్షకుడికి కలగడం ఖాయం. సాంకేతికంగా అన్ని అంశాలను చక్కగానే డీల్ చేశారు. లవ్‌ట్రాక్‌లో మాత్రం అక్కడక్కడా పక్కదారులు పట్టించినా మేకింగ్ పరంగా ఓ ప్రయోగంగానే చెప్పుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయంట్ అయంది. కెమెరాపనితనం సినిమాకు హైలైట్. ముఖ్యంగా వేగంగా సాగే సినిమాను చీకట్లో చూపించిన విధానం నచ్చుతుంది. నిర్మాణ విలువలు ఓకె. విశాల్ ఎప్పటిల్లాగే తన ట్రాక్‌లో చేసుకుంటూ పోయాడు. కేథరిన్ అందాల ఆరబోతకే పరిమితమైంది. పాటలు సోసోగా సాగాయి. దర్శకత్వ పరంగా ఓ ప్రయోగంగా పాండ్యరాజ్ కథకళిని తెరపై ఆడించడంలో ఫర్వాలేదనిపిస్తాడు.