Thursday, June 16, 2016

itlu sravani subrmanyam

మా చావుకు ఎవరూ బాధ్యులు కారు!

Sakshi | Updated: November 29, 2015 13:13 (IST)
మా చావుకు ఎవరూ బాధ్యులు కారు!
 నిప్పులు చిమ్ముకుంటూ  నింగికి నేనెగిరిపోతే,
 నిబిడాశ్చర్యంతో వీరు - నెత్తురు కక్కుకుంటూ
 నేలకు నే రాలిపోతే  నిర్దాక్షిణ్యంగా వీరే...
 మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవిత పూరి జగన్నాథ్‌కు చాలాసార్లు గుర్తుకొస్తోంది.

‘బాచి’కి ముందు... ‘బాచి’కి తర్వాత... తన లైఫ్‌లో ఎన్ని మార్పులు వచ్చేశాయ్! సినిమా జీవితం అంటే ఇంతేనా? మనిషిని మనిషిగా కాకుండా సక్సెస్‌తోనే ఇక్కడ కొలుస్తారన్నమాట!  పవన్‌కల్యాణ్‌తో ‘బద్రి’ చేసెయ్యగానే పొలోమంటూ ఒకటే జనం. సినిమా చేయమనే నిర్మాతలు, ఒక్క చాన్స్ అని అడిగే ఆర్టిస్టులూ టెక్నీషియన్లతో ఊపిరాడనంత బిజీ. అసలే మొహమాటం. అందరినీ సంతృప్తిపరిచి పంపాలి. స్క్రిప్టు చేసుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీ.  ఇదే మనుషులు ‘బాచి’ రిలీజ్ తర్వాత ఏమైపోయారు? అంతా నిర్మానుష్యం. ఈ ఫ్లాప్ చాలా ప్రశాంతంగానే ఉంది. కొంచెం మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా పని చేసుకోవచ్చు. అంతవరకూ ఓకే.

తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోగలగాలి. తనను తాను మళ్లీ మార్కెట్ చేసుకోగలగాలి. పవన్‌కల్యాణ్‌తో ‘బద్రి’ చేయడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో, ఈసారి అంతకన్నా ఎక్కువ కష్టాలు పడాలి. ఎందుకంటే ఇప్పుడు తాను ‘జీరో’ స్టేజ్‌లో లేడు. ‘మైనస్’ స్టేజ్‌లో ఉన్నాడు. ఈ చీకటిని తొలిగించే రవితేజం కావాలి. పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు.
    
కె.బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’... పూరీకి ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. పెద్దలు ఒప్పుకోలేదని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం దానికి క్లైమాక్స్.  దీనికి కొనసాగింపుగా బాలచందర్ ‘డాన్స్‌మాస్టర్’ తీశారు. ఆత్మహత్య చేసుకున్న జంటలో ఒకరు బతికి, ఇంకొకరు చచ్చిపోతే ఏంటి పరిస్థితి?  ఈ పాయింటాఫ్ వ్యూలో ‘డాన్స్‌మాస్టర్’ తయారైంది. అదే కొండ చరియ మీదకు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన ఓ అమ్మాయి, అబ్బాయికి మధ్య పరిచయమేర్పడి ప్రేమలో పడితే? భలే ఆలోచన కదూ! పూరి చకచకా స్క్రిప్టు రాసేశాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ పేరుతో దూరదర్శన్‌కి అప్లయ్ చేశాడు. రిజెక్ట్ అయ్యింది. అరె... ఇంత బాగున్న కథను ఎలా వెనక్కు పంపిస్తారు! ఇంకో ట్రయల్ వేద్దాం. సేమ్ స్టోరీ. కానీ టైటిల్ మారింది...‘కొండ చరియ’. మళ్లీ రిజెక్ట్ అయ్యింది.

దాంతో దాన్ని సూట్‌కేస్ అడుక్కి తోసేశాడు పూరి. ఇప్పుడు మళ్లీ దాని అవసరం పడింది. బురదలో ఉన్నా వజ్రం వజ్రమే. పెట్టె అడుగున ఉన్నా ఈ కథ విలువే వేరు. పవన్‌కల్యాణ్‌ను కలవడం కోసం చేసిన నానా ప్రయత్నాల్లో భాగంగా ఛోటా కె.నాయుడిని మీట్ అయ్యాడు. ముందు ఇతనికి కథ చెప్పి ఒప్పిస్తే, పవన్‌కల్యాణ్‌ని మీట్ కావచ్చు.  ఆ క్షణంలో పూరీకి ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ గుర్తొచ్చింది. ఇలాంటి ఫీల్ ఉన్న కథతో ఛోటాను చిటికెలో పడేయొచ్చు. అదే జరిగింది కూడా. ‘బద్రి’ చాన్స్ రావడానికి ఇన్‌డెరైక్ట్‌గా ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ పనికొచ్చింది.

ఆ కథ బావుంటుంది. కానీ ఎక్కడో లోపం ఉంది. సినిమా థియరీకి అనుగుణంగా మార్చి చూస్తే? పూరీకి అప్పుడు సిడ్ ఫీల్డ్ గుర్తుకొచ్చాడు. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ ఆయన. స్క్రీన్‌ప్లే గురించి ఆయన చెప్పిన థియరీనే చాలామందికి పెద బాలశిక్ష.
 పూరి ఆ థియరీని ఫాలో అయ్యి కథను మార్చాడు. పక్కాగా వచ్చింది. ఇప్పుడు తనకిదే బ్రహ్మాస్త్రం. దీంతో తన కెరీర్‌ని పటిష్టం చేసుకోవాలి.
     
నాగార్జున మేనల్లుడు సుమంత్... హీరోగా అప్పుడే లాంచ్ అయ్యాడు. కుర్రాడు బాగున్నాడు. ఈ కథకు అతనైతే బాగుంటుంది.
 సుమంత్‌ని కలిశాడు పూరి. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ కథ చెప్పాడు. సుమంత్‌కి నచ్చినట్టు లేదు. ఇంకో కథ చెప్పాడు. అదీ నచ్చలేదు.

దేవుడా... ఏంటి పరిస్థితి? డైలమాలో పడిపోయాడు పూరి.
 తరుణ్ కూడా అప్పుడు మంచి స్వింగ్‌లో ఉన్నాడు. అతనితో ఈ సినిమా చేద్దామన్నాడు నిర్మాత గవర పార్థసారథి. ఎవరికైనా ఈ కథ సెట్ అవుతుంది. అదే పూరి ధీమా. కానీ తరుణ్ దాకా బాల్ వెళ్లలేదు. వాళ్ల అమ్మగారు రోజారమణి దగ్గరే ఆగిపోయింది. ‘బద్రి’ తీసిన డెరైక్టర్‌కి ఎన్ని కష్టాలొచ్చిపడ్డాయి!
    
పెరట్లో నిధి పెట్టుకుని ఊరంతా వెదకడమంటే ఇదే. పూరి తనను తాను తిట్టుకున్నాడు. అరె... ఎంత తప్పు పని చేశాడు! రవితేజ ఉండగా ఇంకెవరితోనో ఈ సినిమా ఎందుకు ప్లాన్ చేయాలి! రవితేజ అంటే పూరికి చాలా ఇష్టం. ఎప్పుడో గుణశేఖర్ ‘లాఠీ’ సినిమా షూటింగ్‌లో మొదటిసారి చూశాడు తనని. అందులో రవితేజది చాలా చిన్న వేషం. కానీ అతని స్పీడ్ వాకింగ్ స్టయిల్, బాడీ లాంగ్వేజ్, వాయిస్, యాక్టింగ్ స్టయిల్ చూసి ఇంప్రెస్ అయిపోయాడు.

ఆ తర్వాత ‘నిన్నేపెళ్లాడతా’ షూటింగ్ స్పాట్‌లో కలిశాడు. ఓ సీన్‌లో నాగార్జున జుట్టు ఎగిరేలా చేయడం కోసం రవితేజ ఫ్యాన్ పట్టుకున్నాడు. ఆ సినిమాకతను అసిస్టెంట్ డెరైక్టర్. పూరి ఆ సినిమాకు ప్రోమోస్ చేస్తుండేవాడు. ‘‘అదిగో... అక్కడ ఫ్యాన్ పట్టుకున్నాడే... నేను సినిమా అంటూ చేస్తే... అందులో అతనే నా హీరో’’ అని చెప్పాడు పూరి, తన పక్కనున్న వాళ్లతో. ఎందుకు నవ్వారో గానీ, వాళ్లు నవ్వారు.

‘సింధూరం’ టైమ్‌కి ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ‘‘నీతో సినిమా చేస్తా రవీ’’ అని కలిసినప్పుడల్లా చెబుతుండే వాడు పూరి. ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే అనుకునేవాడు రవితేజ.  కానీ, పూరి అందరిలాంటివాడు కాదు. మాటిస్తే అంతే. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ కోసం రవితేజను పిలిచాడు. ఎగురుకుంటూ వచ్చాడు రవితేజ. కానీ రవితో పూరి సినిమా అంటే నిర్మాతలంతా ఎగిరిపోయారు.  హీరో రెడీ. డెరైక్టర్ రెడీ. స్టోరీ రెడీ. కానీ, ప్రొడ్యూసర్లే లేరు.
   
ఇద్దరు అడ్వకేట్స్... కె.వేణుగోపాల్ రెడ్డి, సి.శేషురెడ్డి. రవితేజకు ఫ్రెండ్స్. సినిమా అంటే ఇద్దరికీ పిచ్చి ప్రేమ. వాళ్లిద్దరూ ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చారు. పాపం... చాలామంది భయపెట్టారు. అయినా మొండిగానే దిగారు.  రవితేజ పక్కన ఇద్దరు హీరోయిన్లు. ఒక హీరోయిన్‌గా ప్రత్యూష ఓకే. తెలుగమ్మాయే. మంచి ఫామ్‌లో ఉంది. రవితేజ, ప్రత్యూషలతో ఫొటో సెషన్ చేశారు. ప్రత్యూష ఓ తమిళ సినిమాలో లాక్ అయ్యింది. డేట్స్ క్లాష్ అయ్యాయి. బాధపడుతూనే వీళ్లకు బైబై చెప్పింది.

సరే... ఏం చేస్తారు! మోడల్ కో-ఆర్డినేటర్స్‌ను పిలిచి రకరకాల ఫొటోలు చూశారు. ఓ బెంగాలీ అమ్మాయి నచ్చేసింది పూరీకి. వెంటనే ఫోన్ చేశాడు. ‘‘మీరు హీరోయిన్‌గా చేస్తారా?’’ అని అడగ్గానే, ఆ అమ్మాయి ఒకటే ఏడుపు. ముంబయ్‌లో రెండేళ్లు అవకాశాల కోసం ట్రై చేసి చేసి, ఫలితం లేక అప్పుడే బెంగాల్ రైలు ఎక్కుతోంది. ఆ టైమ్‌లో ఈ ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయే తనూరాయ్.

సహారా ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్‌లో వెళ్తున్నప్పుడు ఓ ఎయిర్ హోస్టెస్ బాగా నచ్చేసింది పూరీకి. ఆమెను డెరైక్ట్‌గా అడిగేశాడు నా సినిమాలో నటిస్తావా అని. ఆమెక్కూడా యాక్టింగ్ అంటే ఆసక్తే. వెంటనే ఓకే చెప్పేసింది. ఆమె పేరు సమ్రీన్.  ‘బాచి’తో తను పరిచయం చేసిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రీకే రెండో చాన్‌‌స. చిరంజీవి సినిమాలకు పనిచేసిన దత్తు కెమెరామ్యాన్. ఇలా కాస్ట్ అండ్ క్రూ అంతా సిద్ధం.
     
2001 ఫిబ్రవరి 24. ‘నేడే షూటింగ్ ప్రారంభం’ అంటూ పేపర్లలో యాడ్స్ ఇచ్చారు. ‘మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. మాకు 34 కష్టాలున్నాయి’ అనే క్యాప్షన్‌కి అందరూ ఫ్లాట్ అయిపోయారు. షూటింగ్ మొదలవక ముందే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.

సాధారణంగా ముందు ఎవరూ క్లైమాక్స్ తీయరు. పూరి మొండిఘటం కదా! అందుకే మొదట క్లైమాక్స్ షూట్ చేసేశారు. బీచ్ ఒడ్డున సాంగ్ మాంటేజెస్ తీస్తున్నారు. తనూరాయ్‌కి ఒకడు సైట్ కొడుతున్న షాట్. ఆ ఆర్టిస్ట్ కంగారు పడిపోతున్నాడు. నాలుగైదు టేక్స్ తీసుకున్నాడు. ‘‘నువ్వే చేసెయ్ జగన్’’ అన్నాడు రవితేజ. దాంతో పూరీనే ఆ షాట్‌లో నటించాల్సి వచ్చింది.

హైదరాబాద్, వైజాగ్... కేవలం రెండే లొకేషన్లు. విదేశాల్లేవు. వేరే అవుట్‌డోర్లు లేవు. షూటింగ్ కూడా సూపర్ స్పీడ్‌తో పూర్తి అయిపోయింది. 45 రోజులు... 45,000 నెగటివ్ ఎక్స్‌పోజర్. పూరి మార్క్ స్పీడ్, క్లారిటీ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. తనను నమ్మిన వాళ్లతో సినిమా చేస్తే ఎంతటి సుఖముంటుందో పూరీకి కూడా బాగా తెలిసొచ్చింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ‘బాచి’ లాంటి ఫ్లాప్ ఇచ్చిన పూరి జగన్నాథ్ - ఏమాత్రం క్రేజ్ లేని రవితేజ కాంబినేషన్ అంటే ఎవరికి మాత్రం కిక్కుంటుంది? ఏం క్రేజుంటుంది?  ఫిల్మ్ చాంబర్ థియేటర్‌లో షోల మీద షోలు వేస్తున్నారు. ఏదో మొక్కుబడిగా బిజినెస్ జరిగిందంతే. అసలు అద్భుతం 2001 సెప్టెంబర్ 14న జరిగింది.

ఇది ‘హిట్లు శ్రావణి సుబ్రమణ్యం’ అని ప్రేక్షకులు మార్నింగ్ షోతోనే కన్‌ఫామ్ చేసేశారు. పూరి ప్రతిభ ఏపాటిదో ఇండస్ట్రీ అర్థం చేసుకుంది. టైటిల్ దగ్గర్నుంచి కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే, టేకింగ్, సాంగ్స్... ఇలా అన్ని చోట్లా పూరీ మార్క్ కనిపించింది. రవితేజపై కూడా నమ్మకం పెరిగింది. ఈ సినిమా పుణ్యమా అని చిన్నా చితకా అందరిపై ఫోకస్ పడింది. ఒక్కడి విజయం ఎంతమందికి కలిసొచ్చిందో కదా!
     
పూరి ఆఫీస్ కళకళలాడిపోతోంది. వచ్చేపోయే జనంతో సందడి సందడిగా ఉంది. పూరి ఇప్పుడు వాస్తవంలో ఉన్నాడు. విజయం కంటే పరాజయం రుచి బాగా తెలిసొచ్చింది. అందుకే తర్వాతి సినిమా కోసం మరిన్ని కసరత్తులు చేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రశంస పన్నీరు లాంటిది. దాంతో దాహం తీరదనే సంగతి పూరి జగన్నాథ్‌కు ప్రత్యేకంగా చెప్పాలా?!

వెరీ ఇంట్రస్టింగ్...
బెస్ట్ స్టోరీ రైటర్‌గా పూరి జగన్నాథ్‌కు నంది అవార్డు వచ్చింది.
హీరో అర్జున్ తమిళంలో ‘తవమ్’ పేరుతో రీమేక్ చేశారు. అరుణ్ విజయ్, అర్పిత వందన కాంబినేషన్‌లో శక్తి పరమేశ్ డెరైక్ట్ చేశారు.
- పులగం చిన్నారాయణ

Thursday, March 31, 2016

రన్

రన్-- చతికిలపడ్డాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
బాగోలేదు రన్
తారాగణం:
సందీప్‌కిషన్, అనీషా అంబ్రోస్, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్, రాంప్రసాద్, బాబి సింహ , కాశీ విశ్వనాథ్, బంటి సతీష్ తదితరులు
సినిమాటోగ్రఫీ:
రాజశేఖర్
సంగీతం: సాయకార్తీక్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి, కిషోర్, అజయ్ సుంకర,
దర్శకత్వం: అని కనె్నగంటి
తమిళంలో సూపర్ హిట్ అయిన నేరం చిత్రానికి రీమేక్- రన్. అని కనె్నగంటి దర్శకత్వం, అనీష అంబ్రోస్ అందం, అనిల్ సుంకర సమర్పణ ఎవరినెలా ఆకట్టుకుందో చూద్దాం.
ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని కొత్త జాబ్‌ను వెతికే ప్రయత్నంలో ఉన్న కుర్రాడే సంజు (సందీప్ కిషన్). చిన్ననాటి స్నేహితురాలైన అమూల్య (అనీష అంబ్రోస్)తో ప్రేమలో ఉంటాడు. జాబ్ లేదనే కారణంగా అమూల్య ఫాదర్ శ్రీనివాసులు (కాశీ విశ్వనాథ్) వీరి పెళ్ళికి ఒప్పుకోడు. డబ్బు వడ్డీకి తీసుకుని, చెప్పిన టైంకి ఇవ్వకపోతే ప్రాణంతీసి బాడీ పార్ట్స్ అమ్ముకునైనా అప్పు వసూలు చేసుకునే కిరాతకుడు వడ్డీ రాజు (బాబీసింహా). సంజు తన చెల్లి పెళ్ళికోసం వడ్డీ రాజు దగ్గర అప్పుతీసుకుంటాడు. కట్ చేస్తే డబ్బు తిరిగి ఇవ్వాల్సిన టైం వస్తుంది. సంజు డబ్బుతో బయలుదేరుతాడు. అదే టైంలో రెండు ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవే అమూల్య సంజుకోసం ఇంటినుంచి వచ్చేయడం, సంజుదగ్గర ఉన్న డబ్బుని దొంగల బాచ్ కొట్టేయడం. ఇక అక్కడినుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది...? సంజు ఒకే టైంలో దొంగలు కొట్టేసిన డబ్బుని దక్కించుకోవడానికి ఏంచేసాడు? అమూల్యని ఎలా దక్కించుకున్నాడు? వడ్డీరాజు డబ్బుకోసం సంజుని ఎలా ఇబ్బందుల్లో తోసాడు? అన్నదే అసలు కథ.
సైలెంట్‌గా కనిపిస్తూ, చేసేవన్నీ చేసేసే టైపు పాత్రలో సందీప్ కిషన్ కనిపించాడు. కాస్త అండర్‌ప్లే చేసే ఈ పాత్రని అసలు చేయలేకపోయాడు. కొన్నిచోట్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే, కొన్నిచోట్ల అవసరమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేకపోయాడు. అనీషా అంబ్రోస్ మాత్రం క్యూట్ లుక్స్‌లో కనిపించింది. ప్రేమ సన్నివేశాల్లో హావభావాలు బాగా పలికించింది. సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత మాత్రం లేదు. ఇక సినిమాకి కీలకమైన పాత్ర చేసింది బాబీ సింహా.. తమిళ వెర్షన్‌లో చేసిన పాత్రని మళ్ళీ చేయడంలో చాలావరకూ సక్సెస్ అయ్యాడు. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నా కుదరలేదు. అమ్మాయిని బుట్టలో వేసుకునే పాత్రలో మహాత్ రాఘవేంద్ర ఓకే అనిపించాడు. ఇక ఎస్‌ఐ పద్మావతిగా బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళిలు అక్కడక్కడా నవ్వించారు.
ఇక స్క్రీన్‌ప్లే తమిళ వెర్షన్‌లో ఎలా ఉందో యాజిటీజ్‌గా అలానే ఉంది. సినిమా ప్రారంభం టైం అనే కానె్సప్ట్ గురించి చెబుతూ ఆసక్తికరంగా స్టార్ట్‌చేసి, అంతే ఆసక్తికరంగా సినిమాని నడిపించాడు. మొదటి అర్ధ్భాగంలో కొన్నికొన్ని స్లోసీన్స్ ఉన్నా ఫ్లోలో పరవాలేదనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బాంగ్‌కి ఇక టార్గెట్ ఏంమిటో తెలిసిపోవడం, కొత్తగా జత చేసిన సీన్స్ బోర్‌కొట్టడంతో సెకండాఫ్ స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తుంది. సూపర్ హిట్ కానె్సప్ట్‌ని డైరెక్టర్ అనిల్ కనె్నగంటి మిస్‌యూస్ చేశాడనిపిస్తుంది. మిగతా టెక్నికల్ టీంలో రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. హైదరాబాద్‌లోని లొకేషన్స్‌ని, గల్లీలని ఎఫెక్టివ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించి విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు. మ్యూజికల్ డైరెక్టర్ సాయికార్తీక్ అందించిన పాటలు బాగున్నా సినిమాలో లెంగ్త్ పెంచేసి బోర్‌కొట్టించాయి. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్ ఎం.ఆర్.వర్మ ఫస్ట్‌హాఫ్‌ని మేనేజ్ చేసినా సెకండాఫ్‌ని మేనేజ్ చేయలేక సాగదీసేసి ఆడియన్స్ బోర్ కొట్టించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఒరిజినల్ వెర్షన్‌లోని ఫీల్‌ని మిస్‌చేసి చేసిన సినిమా ఇది. కంటెంట్‌ని వదిలేసి కమర్షియాలిటీకి ప్రాధాన్యతనిచ్చి చేసే రీమేక్ సినిమా ప్రేక్షకులను మెప్పించినట్లు, హిట్ అయినట్టు దాఖలాలు లేవు. రీమేక్ అనగానే తెలుగులో చేసే మొదటి తప్పు, ఒరిజినల్ ఫీల్‌ని వదిలేసి ఇక్కడి ఆడియన్స్‌కోసం నానా హంగామా దట్టించడం, పంచ్‌ల కామెడీ కోసం ఒరిజినాలిటీని చంపేయడం. అదే తప్పు ఈ సినిమాలోనూ జరిగింది. అందుకే పరిగెత్తాల్సిన సినిమా కాస్తా పాకినట్టు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కమర్షియల్ అంశాలను అందించాలని పాటలను, కామెడీని బలవంతంగా జొప్పించారు. సినిమాలో డైరెక్టర్ తెగ కామెడీ ఉందని ఫీల్ అయినా ఆడియన్స్ మాత్రం నవ్వలేకపోయారు. పైగా సినిమాకి కీలకం అయిన వడ్డీ రాజు పాత్రని సీరియస్‌గా కాకుండా కామెడీగా మార్చడం కంటెంట్‌ని తప్పుదోవ పట్టించింది. అలాగే దొంగల ముఠా బాచ్‌కోసం కమెడియన్స్‌ని నటీనటులుగా ఎంచుకోవడం అస్సలు సెట్‌కాని విషయం.

దృశ్యకావ్యం


ఓ దెయ్యం కథకి ‘దృశ్యకావ్యం’ అన్న భావుకత్వపు టైటిల్ పెట్టడం వరకూ.. కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. ఐతే -ఆ దెయ్యం చేష్ఠల్లో మాత్రం వెరైటీ ప్రోగ్రామింగ్‌లేవీ లేవు. పాత దెయ్యం కథలన్నీ... నేలమాళిగలోనో సమాధిలోనో పెట్టి.. ఇనే్నళ్లకో ఇన్నాళ్లకో తీసి తెర కెక్కిస్తే.. ఆ హారరే వేరనుకోటానికీ లేదు. కానీ- కాస్త శృతిమించి ‘పార్ట్-2’ అంటూ జనం చెవుల్లో సరికొత్త పూలు పెట్టడం చూస్తే.. ఆహా నిజంగానే ‘ఇదో దృశ్య కారం’ అనిపించక మానదు. నిజానికి ఈ కథలో కొత్తదనం లేకపోలేదు. అదేంటో చూద్దాం.
కథ: -అఖిల్ (రామ్ కార్తీక్), అభినయ (కశ్మీరా కులకర్ణి) -ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. ఒకానొక రోజు అభినయ కుటుంబం మొత్తం ప్రమాదవశాత్తు మరణించటంతో ఆమెపట్ల మరింత ప్రేమని కనబరుస్తాడు అఖిల్. ఆ ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. వారి ప్రేమకి ప్రతిరూపం అనన్య. జీవితం ఇలా సాఫీగా నడిచిపోతూంటుంది. ఇంతలో -ఆఫీస్ పని మీద అఖిల్ యూరప్ వెళ్లాల్సి వస్తుంది. ట్రిప్ కోసం బయల్దేరుతుండగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే దారిలోనే యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. ఐతే - అఖిల్ ఎప్పటిలానే ఫ్యామిలీకి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూంటాడు. మరోవైపు అఖిల్ ఇంట్లో ఏవో శక్తులు తిరుగుతూంటాయి? ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
మరణించిన అఖిల్ ఫోన్ ఎలా చేశాడు? ఆ ఇంట్లో తిరుగాడే అదృశ్య శక్తులు ఏమిటి? ‘నో ఎండ్ ఫర్ ఫీలింగ్స్’ అంటూ ముగించిన ఈ కథలో కొన్ని ప్లస్ పాయింట్లు.. బోలెడన్ని మైనస్ పాయింట్లు దొర్లాయి.
సినిమా అంతా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో.. ఓ నాలుగైదు పాత్రల మధ్య నడుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని లవ్‌ట్రాక్‌తో నడిపించి.. హారర్ ఏ మాత్రం టచ్ చేయకపోవటంతో.. ప్రేక్షకుడు కొద్దిగా సందిగ్ధంలో పడతాడు, అసలు దర్శకుడు ఏం చెబుతాడా? అని. ఇప్పటికే ఒక ‘కట్టప్ప’తోనే జనం ఛస్తూంటే.. ‘దృశ్య కావ్యం-2’లో అసలు హారర్ ఉంటుందనటం అతిశయోక్తి కాక మరేమిటి? ఇన్ని రీళ్లలోనూ ఏం చెప్పారన్నదే ప్రధాన ప్రశ్న. ఇక - చెప్పటానికి ఏం మిగిలిందని ఈ మంత్రం వేశారో అర్థం కాలేదు.
హారర్ కథల రోజులివని.. తెగ ముచ్చటపడి మరీ కథని రాసుకొనేప్పుడు.. లాజిక్ మిస్సవటం సహజం. ఐతే -ఆ లాజిక్‌కి దొరక్కుండా కూడా కథని రాయ్యొచ్చు. ఇక్కడ -ఒక్కటే లోపం. తమ కథని తామే అత్యద్భుతంగా ఊహించుకోవటం. పేజీలపై ‘దృశ్య కావ్యం’గా భావించిన కథ స్క్రీన్‌పైకి వచ్చేప్పటికి.. అటు భావయుక్తంగా కాకండా.. భయపెట్టేదిగానూ లేకపోవటంతో ‘కావ్యం’ కారం నసాళానికి అంటింది. కథకుడిగానే అర్థం కానప్పుడు.. దర్శకుడిగా ఏమర్థమవుతాడు. అదీగాక - ఈ చిత్రానికి సృజనకు పదును పెట్టాల్సిన పనిలేదు. సన్నివేశాలన్నింటినీ ఏ రీతిన తీయాలో... మునుపటి ‘దెయ్యం’ కథలే చెప్పాయి. కాబట్టి కొత్తగా ఆవిష్కరించాల్సిందేమీ లేదు. దర్శకుడి ఊహ ప్రకారం ఆ ఒక్క ‘సస్పెన్స్’ కథని నడిపిస్తుందనుకున్నాడు. కానీ- ఆ ఫీల్‌ని ప్రేక్షకుల్లో కలిగించలేక పోయాడు.
‘ప్రాణం’ కమలాకర్ సంగీతం బాగుంది. పాటల్లో మెలోడీ తొణికిసలాడింది. ఐతే -అవేవీ శ్రోతల్ని చేరతాయా? లేదా? అన్నది సందేహమే. సంతోష్ షనమోని ఫొటోగ్రాఫర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
నటనాపరంగా - మధునందన్ మెప్పించాడు. రామ్‌కార్తీక్ హావభావాలు సోసో. కశ్మీరా చూట్టానికి బాగుంది కానీ.. మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ తెప్పించటానికి చాలా కృషి చేసినట్టుంది. తెర మీదికి ఫైనల్ వచ్చినవి చూస్తే- ‘కృషి’ కనిపిస్తోంది. పాప కేరెక్టర్ ఈ సినిమాకి ప్రాణం. మిగతా పాత్రధారులంతా నవ్వించటానికో.. ఏడిపించటానికో.. భయపెట్టడానికో కష్టపడ్డారు. కానీ అంత ‘దృశ్యం’ లేదు.

ఊపిరి

ఊపిరి -వేసవిలో చల్లని దొరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
బాగుంది ఊపిరి
తారాగణం:
నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్‌రాజ్, జయసుధ, తనికెళ్ల భరణి, అలీ, గాబ్రియాలా, అనుష్క, శ్రీయ తదితరులు
నిర్మాతలు:
ప్రసాద్ వి.పొట్లూరి, కవిన్ అనే్న
సంగీతం:
గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ:
పిఎస్ వినోద్
దర్శకత్వం:
వంశీ పైడిపల్లి
--
వీల్‌ఛెయిర్‌లో నాగార్జున. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ తర్వాత.. ఎవరైనా ‘మన్మథుడి’ రొమాన్స్ తాలూకు అనుభూతిని పొందాలనుకుంటారు తప్ప -వీల్‌ఛెయిర్‌కే పరిమితమైతే ప్రేక్షకుడి ‘ఊపిరి’ ఒక్కసారిగా ఆగిపోతుంది. అందులోనూ ‘ది ఇన్‌టచబుల్స్’ ఫ్రెంచి మూవీకి రీమేక్ ఇది. మనోళ్లు స్ట్రెయిట్ పిక్చర్స్‌తోనే తర్జనభర్జనలుపడి తల్లకిందులవుతూంటే.. ‘హార్ట్ టచ్‌బుల్స్’కి ఏమేరకు న్యాయం చేకూర్చగలరు? అన్న మీమాంస వేధిస్తుంది. మరోవైపు ‘బృందావనం’ ‘ఎవడు’ కమర్షియల్ చిత్రాల ధోరణి ఇంకా వీడక ముందే.. క్లాసిక్‌ని ‘టచ్’ చేయటంలో వంశీ ‘వశీకరణ’ మంత్రం ఏదైనా వేయగలడా? బోలెడన్ని సందేహాలు. ‘వంశీ’ ఇన్‌టచబుల్స్ కథకి రీమేక్ అన్నప్పుడు.. ఎవరికైనా కలిగిన మొదటి సందేహం ఇదే. ఆ ‘్ఫల్’ని చెడగొట్టడానికి కాకపోతే ఏంటి? అని. రీమేక్ అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. ఏమాత్రం అటు ఇటు అయినా.. కథ అడ్డం తిరుగుతుంది. అసలు తెలుగులో ‘హీరో-వీల్‌ఛెయిర్’ అంటే బుద్ధి ఉన్న ప్రేక్షకుడు ససేమిరా అంటాడు. కమర్షియల్ ‘వీల్’కీ, ఇమేజ్ చట్రాలకూ అలవాటు పడింత్తర్వాత -కొత్తదనం కోసం చేసే ఏ ప్రయోగమైనా.. ఇండస్ట్రీలో దెబ్బ కొట్టేస్తుంది. మరి వంశీ ఏంచేస్తాడా? అని ‘ఊపిరి’ బిగపట్టుక్కూర్చున్న ప్రేక్షకుల మదిలో ‘ఊపిరు’ లూదాడా? లేదా? అన్నది చూద్దాం.
-విక్రమాదిత్య (నాగార్జున) వేల కోట్లకు అధిపతి. ఒకానొక పరిస్థితిలో రెండు కాళ్లూ చచ్చుబడి ‘వీల్ ఛెయిర్’కి అతుక్కుపోతాడు. అతడి విశాల ప్రపంచం ఒక్కసారిగా కుంచించుకు పోతుంది. అడుగుతీసి అడుగు వేయలేని స్థితి. విక్రమాదిత్యకి అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి ప్రసాద్ (ప్రకాష్‌రాజ్). అసిస్టెంట్ కీర్తి తనని అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నప్పటికీ ఏదో కోల్పోయానన్న బాధ విక్రమ్‌ని వేధిస్తూంటుంది.
శీను (కార్తీ)కి డబ్బుంటే చాలు. అదే జీవితం. చిన్నచిన్న దొంగతనాలు చేయటం జైల్లో కూర్చోవటం అతని వృత్తి. ఒక దొంగతనం కేసులో జైలుకెళ్లిన శీను పెరోల్‌పై ఇంటికొస్తే... అతని తల్లి (జయసుధ) అసహ్యించుకొంటుంది. ఇంట్లోంచి వెళ్లగొడుతుంది. తాను మారానని పోలీసులను నమ్మిస్తే తప్ప.. కేసుల్లోంచి బయటపడే ఛాన్స్ లేదు కార్తీకి. దొంగ అని తెలిసింత్తర్వాత ఉద్యోగం ఎవరిస్తారు? ఆ పరిస్థితుల్లో మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తాడు. అదీగాక ‘కీర్తి’ అంటే మనసు పారేసుకోవటంవల్ల ఆ ఉద్యోగానికి ఫిక్స్ అయిపోతాడు.
కీర్తిపై ఇష్టంతోనూ.. ఉద్యోగంపట్ల అయిష్టతతోనూ విక్రమ్ ఇంట్లో చేరిన కార్తీ.. రాన్రాను అతడికి దగ్గరవుతాడు. వారిద్దరి ‘జర్నీ’ వీల్‌ఛెయిర్‌తో మొదలై... దేశ దేశాల్నీ.. ప్రేక్షకుల మనసుల్ని చుట్టి వస్తుంది. క్లైమాక్స్‌లో ఏం జరిగిందన్నది చూడాల్సిందే.
ఏ కథలోనైనా.. రచయిత ఉద్దేశం నెరవేరిందా? లేదా? అన్నది తెలియాలంటే.. ప్రేక్షకుల్ని కూడా ఆయా పాత్రలు ‘టచ్’ చేయాలి. థియేటర్‌లోంచో.. పేజీల్లోంచో బయటికి వచ్చినప్పుడు వెంటాడాలి. వారితో చేసిన ‘ప్రయాణం’ మరికాసేపు ఉంటే బావుణ్ణు అనిపించాలి. ఎమోషన్‌కి మించిన ‘వశీకరణ మంత్రం’ మరొకటి లేదు. మానవుడు ఎంతగా ఆధునికత వైపు పయనించినప్పటికీ.. హార్ట్ టచ్ తాలూకు అనుభూతులు ఇంకా మనసు పొరల్లో ఉన్నాయి. కానీ- వాటిని వెలికితీసే ప్రయత్నమే ఎవరూ చేయటంలేదు. అలాంటి యాంత్రికతలోంచి సగటు ప్రేక్షకుణ్ణి ‘ఊపిరి’ పీల్చుకొనేట్టు చేసిందీ కథ.
ఓ పదిమంది అమ్మాయిల్తో సయ్యాట లాడుతూ.. రొమాంటిక్ చూపుల్తో.. రొమాంటిక్ మాటల్తో.. స్టెప్పులేసే నాగార్జునని ‘వీల్‌ఛెయిర్’కి పరిమితం చేస్తే... పరిస్థితి ఏమిటన్నది ఈ సినిమాలో విభిన్నంగా కనిపిస్తుంది. స్టెప్పులేసేవాడే హీరో కాదు. వీల్‌ఛెయిర్‌లో ఉన్నప్పుడూ హీరోనే. ఇక్కడ కొద్దిగా మనసు గురించి మాట్లాడుకోవాలి. ‘వీల్‌ఛెయిర్’ని పక్కనపెట్టి.. నాగార్జున పలికించిన హావభావాలు కానీ.. కంట తడి పెట్టించే సన్నివేశాలు కానీ.. ‘ఊపిరి’ ఆడటంలేదు.. నన్ను కాస్త బయటికి తీసుకెళ్తావా?’ అంటూ అడిగిన తీరుగానీ.. చూస్తే- ప్రేక్షకుడు కూడా తలాడిస్తాడు. ఆ వీల్‌ఛెయిర్‌ని తోసుకుంటూ ప్రేక్షకుడూ వెళ్లిపోతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే- ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ మల్టీ మిలియనీర్‌కీ.. డబ్బుకోసం ఏదైనా చేసే చిల్లరిగాడికీ.. పొంతన కుదురుతుందా? అనిపిస్తుంది. ఈ రెండు పాత్రలూ థియేటర్‌లోంచి.. స్క్రీన్ పైకి తీసుకెళ్లిపోతాయి. ఆ సీన్‌లో అటో ఇటో మనమూ ఉండాలనిపిస్తుంది. ఉంటాం కూడా. అంతగా ప్రభావితం చేస్తాయి. మనసు పొరల్లోని ఆత్మీయతనీ అనుబంధాల్నీ తీయటి అనుభూతుల డోలికల్లో ఊగిసలాడేట్టు చేస్తాయి. మనం మర్చిపోయిన బంధాల్నీ తట్టి లేపుతాయి. జీవితంలో ఇలాంటి వ్యక్తులు తారసపడితే బావుణ్ణనిపిస్తుంది. ఇలా ఒక్కటికాదు.. ఎనె్నన్నో అనుభూతుల మాలికల్తో మనల్ని ముంచెత్తి గాఢంగా ‘ఊపిరి’ పీల్చుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ‘ది ఇన్‌టచబుల్స్’ ఫీల్‌ని -కాళిదాసు కవిత్వం కొంత... నా పైత్యం కొంత అన్నట్టుకాకండా.. ఎలాగూ ‘రీమేక్’ అని జబర్దస్త్‌గా చెప్పేశాం కాబట్టి.. ఉన్నది ఉన్నట్టుగా తీయటంలో తప్పేం లేదని ఫిక్స్ అయిపోయిన వంశీ.. తెలుగు నేటివిటీ కోసం ఏమాత్రం తాపత్రయ పడలేదు. రీళ్లు పెంచాలన్న ఉద్దేశంతో స్క్రీన్‌ప్లే రాసుకోలేదు. అనవసర సన్నివేశాల్ని జొప్పించలేదు.
ఇక నటనాపరంగా -పోటీ పడి జీవించారిద్దరూ. కార్తీకి ఇది తెలుగు స్ట్రెయిట్ పిక్చర్. కానీ ఏమాత్రం భేషజాల్లేకుండా శీను పాత్రలో వొదిగిపోయాడు. నాగార్జున చేసింది కూడా ఓవిధంగా ఛాలెంజింగ్ పాత్ర. ‘సోగ్గాడి’కి అస్సలు నప్పని కేరెక్టర్. కానీ.. ఏదో మత్తు జల్లాడు. ఒక్కో సందర్భంలో ‘నాగ్’కి సహాయకుడిగా మనం ఉంటే బావుణ్ణననిపిస్తుంది -అతడి మాటల తీరు చూస్తే. ఒంటరితనంతో.. అవిటితనంతో.. చాతకాని పరిస్థితిని బయటికి చెప్పుకోలేక.. జీవితాంతం ఒక్కరిపై ఆధారపడటం చూస్తే ఆ కేరెక్టర్ పట్ల జాలి కలుగుతుంది. అదే స్థాయిలో ‘్ఛలెంజింగ్’గానూ అనిపిస్తుంది. ఇలా విశే్లషించుకొంటూ పోతే ‘్ఫల్’ చెడుతుంది. కనుక -‘్ఫల్ గుడ్’ అనేద్దాం. ఏ శాఖ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వారివారి పరిధిలో ఆయా పాత్రలు తమకు నచ్చినట్టు, మనల్ని మెప్పించేట్టు ‘వీల్‌ఛైర్’ని తోసుకుంటూ వెళ్లిపోయాయి.

**కథకళి

పక్కా.. స్క్రీన్‌ప్లే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
**కథకళి
తారాగణం:
విశాల్, కేథరిన్ ట్రెస్సా, మైమ్ గోపి, మధుసూదన, కరుణాస్ తదితరులు
సంగీతం:
హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ:
బాలసుబ్రహ్మణ్యం
నిర్మాత:
విశాల్
దర్శకత్వం:
పాండీరాజ్
--
ఫర్వాలేదు
--
ప్రేక్షకుణ్ణి రెండు గంటలపాటు థియేటర్‌లో కూర్చోపెట్టాలంటే మంచి కథే అవసరం లేదు. సరైన స్క్రీన్‌ప్లే ఉన్నా సాధ్యమేనని కథకళి చెబుతుంది. ఓ చిన్న పాయింట్‌తో కథ తీసుకుని దానికి ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే రాసుకుని, సన్నివేశాలను తెరపై కథాకళి చేయిస్తే ప్రేక్షకుడు సీట్లోనుంచి లేవడు అనడానికి ఈ చిత్రం ఓ ఉదాహరణ. కథలనేవి కొన్నిరకాలే. స్క్రీన్‌ప్లే మాత్రం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అలాంటిదానికి ఉదాహరణే కథకళి.
కథేంటి?
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కమల్ (విశాల్) తన ప్రేయసి మల్లీశ్వరి (కేథరీన్ ట్రెస్సా)ని పెళ్లిచేసుకోవడానికి స్వంత ఊరైన కాకినాడ వస్తాడు. అతని కుటుంబానికి ఊర్లో వుండే జాలర్ల సంఘం అధ్యక్షుడు సాంబకు మొదటినుండీ చిన్న చిన్న గొడవలు వుంటాయి. ఈ నేపథ్యంలో సాంబ హత్యకు గురవుతాడు. నేరం ఎవరు చేశారో తెలియదు. కానీ మొదటినుండీ ఉన్న గొడవలవల్ల కమల్ నేతృత్వంలో ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులతోపాటుగా ఊరి ప్రజలు అనుమానిస్తారు. ఆ అనుమానం నిజమా? కాదా? అనేదే మిగతాసినిమా. హత్యనుండి ప్రారంభమైన కథనం ఎత్తుపల్లాలు దాటుకుంటూ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుణ్ణి గుక్క తిప్పుకోకుండా చేస్తుంది. అసలు కమల్ కుటుంబానికీ సాంబకు వున్న గొడవేంటి? పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో వచ్చిన ఈ అవాంతరాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరమైన కథనం.
ఎలా వుంది?
మొదటినుండీ సినిమా స్క్రీన్‌ప్లే హైలెట్స్‌తో సాగడంతో ఎక్కడా బోర్ కొట్టదు. కాకపోతే, కథ చిన్నది కనుక ఆ లోపాన్ని కనపడకుండా స్క్రీన్‌ప్లేను ఎమోషన్స్‌తో మేళవించి రాసుకోవడం ప్లస్‌పాయింట్ అయింది. అయతే, ఏమోషనల్ సన్నివేశాల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగా కుదరకపోవడంతో సన్నివేశాలు సోసోగా సాగాయి. ఒక్కొక్కసారి మరీ ఓవర్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది. దానికితోడు సందర్భం లేకుండా వచ్చిపడే పాటలు ప్రేక్షకుడిని పక్కదారి పట్టిస్తాయి. అయినాకానీ స్క్రీన్‌ప్లే బలంతో లోటు కనపడదు.
సినిమాకు మొదటినుండీ సస్పెనే్స హైలెట్ కనుక దర్శకుడు ఎక్కడా అది రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నడిపాడు. అన్ని సంఘటనలకు సరైన కారణాలను చూపుతూ అన్ని కోణాల్లో అల్లుకున్న స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశం. సినిమాలో పగ, ప్రతీకారాలు అనే అంశాన్ని కథానాయకుడు వైపున, విలన్ వైపున రెండు కోణాల్లో చెప్పినా, అసలు విషయాన్ని చెప్పకుండా సెకండాఫ్‌లో సినిమాను వేగంగా నడిపించడంలోనే దర్శకుడి పనితనం కనిపిస్తుంది. విశాల్ సినిమా అంటేనే యాక్షన్ నేపథ్యంలోవున్న ఫ్యామిలీ డ్రామా. ఈ కథ అందుకు మినహాయింపు కాదు. కుటుంబ కథకే హత్యానేపథ్యం జోడించడంతో ఓ సరికొత్త ఫ్లేవర్‌ను ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. పూర్తి స్థాయి మర్డర్ మిస్టరీకి సరిపడే కథనం కాకపోయినా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుణ్ణి మాయచేశారు. అక్కడక్కడా అవసరం లేని సన్నివేశాలు వచ్చినా అవి పక్కకు తొలగిపోతాయి. కథకళి అన్న పేరే ఈ చిత్రానికి సరైనది అన్నట్టే చేశారు. థ్రిల్లర్ అంశానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి క్లైమాక్స్ కథనాన్ని తగ్గించారు. వైజాగ్ నుంచి కాకినాడ బయలుదేరిన హీరో ప్రయాణంలోనే కథనాన్ని పరిగెత్తించారు. స్క్రీన్‌ప్లే ఎలా సాగిందో అదేవిధంగా క్లైమాక్స్‌లో కూడా సాగినట్టయితే సినిమాకు మరింత బలం చేకూరేది. సినిమా కథనంలో రకరకాల మలుపులు కనపడడంలో అక్కడక్కడా అనుమానాలు ప్రేక్షకుడికి కలగడం ఖాయం. సాంకేతికంగా అన్ని అంశాలను చక్కగానే డీల్ చేశారు. లవ్‌ట్రాక్‌లో మాత్రం అక్కడక్కడా పక్కదారులు పట్టించినా మేకింగ్ పరంగా ఓ ప్రయోగంగానే చెప్పుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయంట్ అయంది. కెమెరాపనితనం సినిమాకు హైలైట్. ముఖ్యంగా వేగంగా సాగే సినిమాను చీకట్లో చూపించిన విధానం నచ్చుతుంది. నిర్మాణ విలువలు ఓకె. విశాల్ ఎప్పటిల్లాగే తన ట్రాక్‌లో చేసుకుంటూ పోయాడు. కేథరిన్ అందాల ఆరబోతకే పరిమితమైంది. పాటలు సోసోగా సాగాయి. దర్శకత్వ పరంగా ఓ ప్రయోగంగా పాండ్యరాజ్ కథకళిని తెరపై ఆడించడంలో ఫర్వాలేదనిపిస్తాడు.

Sunday, July 13, 2014

కథల వెనక కథలు


ఏకథ అయినా ఎక్కడ మొదలవుతుంది, ఒక కథకి ప్రేరణ ఏమిటి అన్న ప్రశ్న ఎలా వచ్చిందో ముందు చెప్తాను.నేను కిందటివారం రాసిన “నేనూ, నారచనలూ” టపామీద కొత్తపాళీగారు ఓ వ్యాఖ్య పెట్టేరు.
 “రచయిత రాసిందే పట్టించుకోవాలి మిగతా వివరాలన్నీ ఎందుకూ అంటారు కొంతమంది. కానీ నా మట్టుకి నాకు ఆయా కథల వెనుక రచయితకి ఉన్న ప్రేరణ ఏవిటి అనేది తెలుసుకోవడం చాలా బాగుంటుంది” అని.
దానిమీద నేను,  సమాధానం రాస్తూ, ప్రేరణమీద రాయడానికి చాలా వుంది అన్నాను, అనాలోచితంగానే.
అయితే రాయండి అని పూర్ణిమగారు అన్నారు. అప్పుడు నాకు తెలివొచ్చింది. J ఏంరాయాలా అని ఆలోచిస్తూ వాక్‌కి బయల్దేరి, దారి తప్పి పొరుగూరు వెళ్లిపోయాను. మాయింటినించి మైలున్నర నడిస్తే పొరుగూరే లెండి. దారి తప్పి తిరుగుతూంటే నాలుగుముక్కలు తోచేయి. ఇవి మీప్రశ్నకి సమాధానం అవునో కాదో మీరే చెప్పాలి.
నిజానికి రాస్తున్నవారందరూ ప్రేరణ కలగబట్టే కదా రాస్తున్నారు. అందుకు సందేహం లేదు. అయితే ఏకథ ఏప్రేరణతో వచ్చింది అంటే అప్పుడు బోలెడు కథలవెనక కథలు తెలుస్తాయి. ఈవిషయమే కొత్తపాళీ అన్నది, కథలకి ప్రేరణ ఏమిటో తెలుసుకోడం తనకి ఇష్టమని. దానికి నాకు తోచిన టీక ఏమిటంటే - చిన్నకథలకి ఒక ముఖ్యలక్షణం క్లుప్తత. అంటే, అటు ఆరుతరాలూ, ఇటు మూడు తరాలూ, లోకంలో గల సమస్త జనుల సమస్యలూ, మినిఎన్‌సైక్లోపిడియాలాగ రాసుకుంటూ పోడానికి నవలలో అయితే సాగుతుందేమో కానీ చిన్నకథలో అలా కాదు.. కథలో ప్రధానాంశంమీద మాత్రమే కేంద్రీకరించి కథ నడపాలి. తెలుగువాళ్లలో అలా రాయడానికి రావిశాస్త్రిగారికి పెట్టింది పేరు. ఆయన కథని శిల్పం చెక్కినట్టు ఒక్కొక్కమాట చెక్కుతారని ప్రసిద్ధి. అలా క్లుప్తంగా చెప్పినప్పుడు సహజంగానే చెప్పకుండా వుండిపోయినసంగతులు చాలా వుంటాయి.
ప్రతిభగల రచయిత కథలోనే మొత్తం చెప్పగలగాలి అంటారు గానీ దానికో లిమిటుంటుంది. చాలా మంచికథలో రచయిత తాను చెప్పదలుచుకున్న విషయం అంతా క్లుప్తంగా, స్పష్టంగా చెప్పి వుండొచ్చు. కానీ, ఆ కథ వెనక కథ ఏమిటో తెలుసుకున్నప్పుడు, ఆకథకి ప్రయెజనం ద్విగుణీకృతమవుతుంది. అంటే ఒకకథగా పరిపూర్ణంగా ఆవిష్కరించడం జరిగినా, దానికి వెనక వున్న ప్రేరణ ఏమిటో తెలిసినప్పుడు మరొకస్థాయి అర్థాన్ని సంతరించుకుంటుంది అని. (కొత్తపాళీగారూ, నా అర్థం తప్పయితే, చెప్పండి).
ఉదాహరణకి, నేను రాయని కథ ఒకటి, అంటే నిజంగా జరిగింది, చెప్తాను. ఒకసారి నేను మాఅమ్మాయిని చూడ్డానికి లాసాంజలస్ వెళ్లేను. తన గదిలో గోడమీద ఒక ఇంగ్లీషు కవిత వుంది. మామూలుగా మనం రోజూ అనుకునే మాటలే - రేపు ఏంఅవుతుందో తెలీదు, అంచేత ఈరోజు హరివిల్లు చూసి ఆనందించు .. అని. కింద తన స్నేహితురాలి పేరు చూసి, టాషా కవితలు రాస్తుందని నాకు తెలీదే అన్నాను.
అది టాషా కాదు, సారా రాసింది అంది మా అమ్మాయి. (నేను పేరు తప్పు చదివాను.).
నేను గతుక్కుమన్నాను. ఎందుకంటే -
టాషా చిన్న చెల్లెలు సారా. చిన్నమ్మాయి. తొమ్మిదేళ్లు.
అంతచిన్నమ్మాయికి అంత ఫిలాసఫీ ఏమిటి అని.
ఆకవిత రాసిన రెండునెలలకి
ఆఅమ్మాయి మరో ఇద్దరు స్నేహితులతో, సైకిళ్లమీద రోడ్డు దాటుతోంది.
అటునించి వస్తున్న కారు చూసుకోలేదు.
ప్రమాదం జరిగింది.
మిగతా ఇద్దరికి చిన్న దెబ్బలే కానీ సారాకి ప్రాణాంతకమైంది.
మరో రెండు వారాలకి ఆచిన్ని ప్రాణం పోయింది.
అవును, మీలాగే, నాకు చాలా బాధగా అనిపించింది. అంతేకాదు, ఇతర ఆలోచనలు - అంతచిన్నమ్మాయికి అంత గంభీరమైనవిషయం ఎందుకు రాయాలనిపించింది,, తాను అట్టే కాలం బతకనని తనకి తెలుసా, కాకతాళీయమా, …
ఇక్కడ నేను ఉదాహరణగా ఇవ్వడానికి కారణం, వాక్యం తరవాత వాక్యం చదువుతుంటే, మీఆలోచనలు మారుతూ వచ్చేయి కదా. అలా మీఆలోచనలు మారుతూ సాగడానికి అనువుగా వాక్యాలు విరిచేను కూడా అనుకోండి. 
కథల్లో కూడా అంతే జరుగుతుంది. మీకు ఒకొక్కవిషయం తెలుస్తుంటే, కథ పువ్వు విడినట్టు వెల్లివిరుస్తుంది. కథ అంతకంతా అర్థవంతమవుతుంది.
నారచనలువ్యాసంలో చాలా చోట్ల నేను ఒక చిన్నవాక్యం ఇచ్చి, ఇదే ఈకథకి ప్రేరణ అని చెప్పేను. అంటే ఆ ఒక్కవాక్యంతో కథ తయారయిపోయిందని కాదు. అది ప్రేరణలో తొలిమెట్టు మాత్రమే. అంతకుముందూ, ఆతరవాతా జరిగిన చాలా సంఘటనలు -విన్నవీ, కన్నవీ, చదివినవీ- చాలా విషయాలు బుర్రలో పురుగుల్లా తొలుస్తూనే వుంటాయి నాకు ఎప్పుడూను.. అందులో కధకి పనికొచ్చేవి ఏరుకుని, కూర్చుకుని కథని ఓకొలిక్కి తెస్తాను. 
ఈవ్యాసంలో, ఏదో ఒకకథ మొదలు పెట్టినతరవాత ఆతొలి ప్రేరణని ఎలా మలుచుకున్నానో చెప్తాను. మీరూ మీకథలని ఎలా మలుచుకుంటున్నారో రాస్తే మంచి చర్చ అయి, మరిన్ని పనికొచ్చే విషయాలు తెలుస్తాయి. 
ఒకొక్కప్పుడు ఏదో ఒకవాక్యం ఠకీమని తగులుతుంది అన్నాను. నవ్వరాదు కథకి మూలం కూడా ఒక్కవాక్యమే. అది 1968లో రాశాను. కాని దానికి మూలకారణమైన వాక్యం విన్నది 1957 ప్రాంతాల్లో. ఆ ఒక్క వాక్యంమీద కథ రాయడానికి అంతకాలం పట్టింది నాకు.
ఆవాక్యం - మావాళ్లలోనే, ఒకాయన. ఆయనకి సంగీతం చాలా ఇష్టం. నలుగురు ఆడపిల్లలకీ వీణ చెప్పించేరు. పెద్దమ్మాయిని మేనత్త తనంత తనే కోరి కోడలుగా చేసుకుంది. మేనరికం అంటే ఈపిల్ల ఏం నేర్చుకుందో తెలిసే వుండాలి కద. పెళ్లి అయింతరవాత, ఆఅమ్మాయి వీణ తీస్తే, సంగీతం ఏమిటి సానికొంపలాఅందిట అత్తగారు. ఆమాట మాఅమ్మ ఎవరితోనో చెప్తుంటే విన్నాను. ఆతరవాత కొంతకాలానికే. చిన్నతనంలోనే ఒక రకమైన మస్క్యలర్ డిస్ట్రెఫీతో చనిపోయింది. నేను షాకు తిన్నాననే అనుకుంటాను. అందుకే నాకు దాన్నిగురించి రాయడానికి అన్నేళ్లు పట్టింది.

అయితే, వాళ్లింట్లో సంగతులు నాకు పూర్తిగా తెలీవు. నిజంగా ఏంజరిగిందో, వున్నదున్నట్టు రాయడానికి లేదు. నాకు అర్థం అయిందల్లా తనవాళ్లే అంత కఠినమైన మాట అన్నారు అన్నదే. అచ్చంగా ఆకథే రాయాలని మొదలుపెట్టలేదు నేను నాకథ.
నాకు చిన్నప్పుటినుండీ నవ్వుతాననీ, నవ్విస్తాననీ పేరుంది. అంచేత, నవ్వడంమీద సరదాగా రాద్దాం అనే మొదలుపెట్టేను. అందుకే ఆమధ్యకాలంలో, 1957-68, అప్పుడప్పుడు వింటున్నమాటలు, చూస్తున్నవిషయాలు పెళ్లి కాని ఆడపిల్లలు అన్నగార్ల ఇంట్లో కాలక్షేపం చెయ్యడం, కాలేజీలో హాస్యాలూ, సినిమాకబుర్లూ … ఇవన్నీ ఆకథలో చోటు చేసుకున్నాయి. హాస్యంగా మాటాడినా, మరోవేపు జనాలని తప్పుకుతిరగడం కూడా నాలక్షణమే. నేనంటే ప్రత్యేకంగా అభిమానం చూపించే స్నేహితురాళ్లు కూడా వున్నారు ఆ పదేళ్లకాలంలోనూ. అలా అనేక విషయాలు, వేరు వేరు స్థలాల్లో వేరు వేరు కాలాల్లో జరిగినవి అనేకం కలిసి ఓకథగా రూపు సంతరించుకున్నాయి. అయితే అందులో సౌందర్యం ఏమిటంటే వాటినన్నటిని ఒకగూట్లోకి చేర్చడం. అది సమర్థవంతంగా చేసానా లేదా అన్నది మీరే చెప్పాలి.

ఇంతటి విషాదకరమైన విషయమే అక్కర్లేదు కథ రాయడానికి. జీర్ణతృణంకథ రాయడానికి ఆధారం అక్షరాలా గరికపోచలే. నేను 1961-62లో లైబ్రరిసైన్సులో చేరేను. అదే సంవత్సరం కొత్తలైబ్రరీ భవనానికి ప్రారంభోత్సవం అయింది. ఇప్పుడున్న లైబ్రరీ అదే. అప్పుడు లైబ్రేరియన్, కోనేరు రామకృష్ణరావుగారు లైబ్రరీచుట్టూ తోట వేస్తే బాగుంటుందనీ, అందర్నీ మొక్కలు తీసుకురమ్మనీ ప్రోత్సహించారు. నేను నిజంగానే అవేవో గడ్డిపరకలు తీసుకువెళ్లేను. ఎక్కడినుంచో నాకిప్పుడు జ్ఞాపకంలేదు కానీ గడ్డి ఇచ్చిన మాట నిజం. ఆతరవాత కొంతకాలం తరవాత చూస్తే, నిజంగానే ఆ గరికపోచలు పచ్చని తివాసీలా కన్నులపండుగ చేసేయి. ఇది అమెరికాలోలాగ కత్తిరింపులసొగసు కాదు. నిలువుగా పెరిగి, సహజమైన కొనలతో వుండే అందం.
అయితే పచ్చగడ్డిమీద కథ ఏం రాయగలం, పల్లెపదాలు రాయొచ్చునేమో కానీ. అంచేత మళ్లీ నా ఖజానాలోంచి కథ లాగాల్సివచ్చింది పత్తిలోంచి దారం లాగినట్టు. చెప్పేను కదా మానాన్నగారు స్కూలుటీచరు కనక, స్కూళ్లలో జరిగే ట్రాన్సఫరులూ, పెన్షనుకోసం పడే అగచాట్లూ నాకు అవగతమే. అంచేత, నా గరికపోచలకి ఓ టీచరమ్మని కథానాయకిని చేసేను. వూరిబయట బంగళా, తుపాకీతో దొరగారూ కొంత రావిశాస్త్రిగారి కథలు చదవగా పట్టుబడ్డ (లేదా పట్టుకోవాలని తాపత్రయపడుతున్న) నుడికారం. రావిశాస్త్రిగారి పువ్వులు కథలో ఈతుపాకీ పేలదు అని ఓవాక్యం వుంది. అది చాలా గొప్పవాక్యం ఆకథలో. పోతే, విశాఖ హార్బరులో అప్పుడప్పుడు కనిపించే తెల్లదొరలూ.

అంటే నేననడం ప్రేరణ అంటే మీట నొక్కినట్టు ఏదో ఒక మాటా, ఒక సంఘటనా, ఒక వస్తువూ .. వూపునివ్వడం మాత్రమే కాదు. కథ మలచడం మొదలు పెట్టిన్నప్పుడు ఇతర సామగ్రి చాలా వాడుకోడం జరుగుతుంది.. ప్రేరణనిచ్చేది ఒకటి కావచ్చు, కథ మరొకటి కావచ్చు.

ప్రతికథకీ ఓమనిషో ఓసంఘటనో మాత్రమే కావాలని ఏం లేదు. ఫలరసాదుల గురియవే పాదపములూ”, “వానరహస్తంలాటి కథలు ముందు శీర్షిక పెట్టేసుకుని, తరవాత కథలు ఆలోచించేను. వానరహస్తంఅన్న శీర్షిక ఎందుకు పెట్టేనని ఎవరైనా అడుగుతారేమోనని చూస్తున్నా కానీ ఇంతవరకూ ఒక్కరూ అడగలేదు. ఇంక సస్పెన్సు భరించలేక నేనే చెప్పేస్తున్నాను.
నేను ఆంధ్రాయూనివర్సిటిలో ఆనర్సు చదివేరోజుల్లో వానరహస్తం అన్న శీర్షకతో ఒక నాటిక చూసాను భారతి మాసపత్రికలో. దానికి మూలం w.w. Jacobs రాసిన Monkey’s paw అన్న ఓ చిన్నకథ. నాకు నాటకాలంటే సరదాలేదు కానీ ఆశీర్షికా, దానివెనక కాంసెప్టూ చాలా నచ్చేయి.  శీర్షికే ప్రేరణ అయినా, నాకథకీ దానికీ మరే సంబంధమూ లేదు. మళ్లీ సంఘటనలకోసం నాభోషాణం వెతక్కోవాల్సొచ్చింది. అంతకుముందు, అంటే ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో మా అప్పాయమ్మ కొడుకు పదేళ్ల కుర్రాడు నాకు కాలేజీకీ కాఫీ తెచ్చేవాడు. రెండునెలలు అయింతరవాత అప్పాయమ్మ చెప్పింది వాడు ఆపని చెయ్యనంటున్నాడని. తోటి పిల్లలు హేళన చేస్తున్నారట కాఫీలు మోస్తున్నాడని. అది తలుచుకున్నప్పుడు నాకు తోచింది అతని వ్యక్తిత్వం. నాకథలో ముత్తయ్యని అలా దిద్దేను. అలాగే నేను లైబ్రరీలో పని చేసేరోజుల్లో ఒకమ్మాయి వుండేది యల్.డి. క్లర్కు. ఇంటినిండా పదిమంది పెద్దా, చిన్నా. తన ఆదాయం ఒక్కటే అందరికీ ఆధారం. అలాటి కొందరు క్లర్కులని చూసిన తరవాత తయారయిన పాత్ర సావిత్రి.
ఆఅమ్మాయికి కన్నీరు పిలిచిన పలుకు తల్లి. ఆవిషయం నేను హాస్యానికైనా వాడుకోవచ్చు, విషాదం సృష్టించడానికేనా  వాడుకోవచ్చు. ఆకళ్లు, … వాటినిండా నీళ్లులాటి వాక్యాలు వాడుకోవాలంటే, కథకుడి బలహీనత చూపాలి. అలాగే ముత్తయ్య తల్లి కల్లూ ఒల్లూ తిప్పుకుంటూ ఊసులాడతాదని ఆయమ్మనొగ్గేసి నాకొడుకు పొట్ట కొట్టీసినాడులాటి వాక్యాలు రాయడానికి కూడా కథకుడిని సావిత్రికి ఆపోజిట్‌గా నిలబెట్టాను. అంచేతే, కథకుడిని అబ్బాయిని చేసేను.

నిజానికి రాయడం ఫుల్‌టైం ఉజ్జేగమే. మీరు రోజుకో కథ రాయక్కర్లేదు. కానీ దానిగురించిన తపన వుండాలి సదా. కనిపించిన ప్రతివస్తువూ, ప్రతి సంఘటనా, ప్రతి మనిషీ కథగా వెంటనే మారిపోరు. పదిలంగా దాచుకుంటే ఎప్పుడేనా పనికొస్తాయి. ప్రేరణ విషయంలో నాకు తెలిసింది ఇంతే.

ఇదీ ‘కొత్త బంగారులోకం’ నేపథ్యం..
 2003 సంవత్సరానికి ముందు నుంచి సినీ పరిశ్రమలోకి వెళ్లాలన్న కోరిక మరీ బలపడింది. దర్శకుడిగా టీనేజ్ కథా వస్తువుతో ఓ చిత్రానికి కథ రాసి, దర్శకత్వం వహించాలన్న లక్ష్యం పెట్టుకున్నా. పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను ప్రేమతో, భయంతో పెంచు తున్న తల్లిదండ్రుల భావాలు.. ఆకర్షణలో చేసే పనిని ఆలోచించి చేయాలని, తప్పు చేస్తే తనతో చె ప్పి చేయాలనే అంశాలు ఆధారంగా పిల్లలను అర్థం చేసుకునే నాన్న పాత్ర ద్వారా ‘కొత్త బంగారులోకం’ తీశా. తొలి చిత్రంతోనే హిట్ కొట్టా.

 ‘సీతమ్మ’ కథకు తిరుపతిలో శ్రీకారం
 తొలి చిత్రం విజయంతో రెండో చిత్రంవైపు ఉత్సాహంగా అడుగులు వేశా. ఈసారి కుటుంబ బంధాలకు సంబంధించి ఓ వినూత్న కథ రాయాలనుకున్నాను. తిరుపతి వెంకన్న అంటే అమితమైన ఇష్టం. ఆయన సన్నిధికి వెళితే రెండు రోజులు కొండపైనే ఉండి, ప్రశాంతంగా గడుపుతాను. అక్కడకు వస్తున్న కోట్లాదిమంది భక్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం ఉంటుంది. కానీ ఆ సన్నిధిలో అందరూ చేతులెత్తి స్వామిని చూసి తన్మయత్వం చెందుతున్న దృశ్యాలను చూశాను. మనిషిలో మంచితనం ఉంటుంది.

 దీనినుంచే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథకు ప్రేరణ దొరికింది. ‘మనిషి అంటే మంచోడు’ అనే మాటతో కథ అల్లాను. ఇద్దరు అన్నదమ్ముల పాత్రలు సృష్టించి ఇద్దరికీ చెరో మనస్తత్వ కోణాలు చూపించి కథ రాశాను. ఈ కథ మల్టీస్టార్‌‌సతో అయితే బాగుంటుందన్న ఆలోచనను నిర్మాత దిల్‌రాజు ముందు ఉంచాను. ఆయన సై అన్నారు. అడిగిందే తడవుగా హీరో వెంకటేష్ తొలుత రెడీ చెప్పారు. తర్వాత మహేష్‌బాబు కథ విని ఓకే అన్నారు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్.